ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ వి సుబ్బారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటినప్పటికీ నేటికీ అక్రిడేషన్ కార్డు జారీ చేయకపోవడం అత్యంత శోచనీయమన్నారు. కార్డ్స్ ఇవ్వడానికి ఏడాదిన్నర పడితే ఇంకా సంక్షేమం ఎప్పుడు చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంత్రిత్వ శాఖ సమాచార శాఖలపై విలేకరులు విశ్వాసం కోల్పోతున్నారన్నారు.