జడ్చర్ల: జడ్చర్ల ఎన్.హెచ్ 44 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ,ప్రవేటు బస్సు ఢీకొని ముగ్గురు మృతి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం వేసుకుంది శుక్రవారం కడప నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సు లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సు డ్రైవర్, కూకట్పల్లికి చెందిన అత్తాకోడళ్లు లక్ష్మీదేవి, రాధిక అక్కడికక్కడే మృతి చెందారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు