సంతనూతలపాడు: ఎనికపాడు పోలేరమ్మ ఆలయంలో చోరీలు జరగకుండా చర్యలు తీసుకోవాలి: సంతనూతలపాడు ఎస్సై అజయ్ బాబు
సంతనూతలపాడు మండలం ఎనికపాడు పోలేరమ్మ ఆలయాన్ని ఎస్సై అజయ్ బాబు సోమవారం పరిశీలించారు. ఆలయంలో చోరీలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆలయ కమిటీ నిర్వాహకులకు ఎస్ఐ సూచించారు. రాత్రిపూట ఆలయం వద్ద కాపలా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయంలో భక్తులు హుండీలో కానుకలు సమర్పిస్తుంటారని ,వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని ఆలయ కమిటీ నిర్వాహకులకు ఎస్ఐ సూచించారు.