సంతనూతలపాడు: నాగులుప్పలపాడు ఎంపీడీవో కార్యాలయంలో కిషోరి వికాసం 2026 పై మండల స్థాయి అధికారుల సమావేశం
నాగులుప్పలపాడు ఎంపీడీవో కార్యాలయంలో గురువారం కిషోరి వికాసం 2026 పై మండల స్థాయి అధికారుల సమావేశం జరిగింది. 11 నుండి 18 సంవత్సరాల లోపు కిషోరి బాలికల సమస్యలు, వారు ఎదుర్కొంటున్న సవాళ్లపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. అదేవిధంగా కిషోర్ బాలికల ఆరోగ్య సమస్యలు, వారికి ఏర్పడే రక్తహీనతపై కూడా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.