సంతనూతలపాడు: నియోజకవర్గంలోని 45 మంది లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేసిన సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్
సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ తన కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 45 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా మంజూరైన రూ.21.08 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అత్యవసర సమయాల్లో కార్పొరేట్ వైద్యశాలలో వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదలు తన దృష్టికి తీసుకువస్తే ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా సహాయాన్ని అందే విధంగా చర్యలు తీసుకుంటానన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.