కనిగిరి: పట్టణంలో వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి పల్లకి సేవోత్సవం
కనిగిరి పట్టణంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన భక్తులు ఆలయానికి తరలివచ్చి , స్వామివారి పల్లకిని స్వయంగా మోసి, కొబ్బరికాయలు కొట్టి, హారతులు పట్టి, పూజలు చేశారు. భక్తులకు ఆశీర్వచనాలను అందజేసిన వేద పండితులు స్వామివారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.