ఉరవకొండ: పెన్న అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి భక్తులు వెండి కిరీటం వితరణ
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెన్న అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి భక్తులు మంగళవారం వెండి కిరీటం వితరణ చేశారు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటకు చెందిన జనార్ధనాచారి-లక్ష్మీ దంపతులు సుమారు 2 కిలోల వెండి కిరీటాన్ని స్వామి వారికి కానుకగా అందించి మొక్కులు తీర్చుకున్నారు.