సంతనూతలపాడు: నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని పరిశీలించిన డిపిఓ మాధురి
నాగులుప్పలపాడు మండలంలోని ఉప్పుగుండూరు లో ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని డిపిఓ మాదిరి క్షేత్రస్థాయిలో ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికంగా బిఎల్వోలు చేపడుతున్న ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను ఆమె స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. గ్రామంలో నిరక్షరాస్యులకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం పై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి వారి ఓట్లను మ్యాపింగ్ చేయాలన్నారు. వచ్చేనెల 15వ తేదీలోపు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయవలసి ఉంటుందని బిఎల్ఓ లకు ఆమె సూచించారు.