కనిగిరి: కంబాల దిన్నే లో గుండెపోటుతో మృతి చెందిన టిడిపి సీనియర్ నాయకుడు మురళి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి నివాళి
పామూరు మండలం కంబాల దిన్నే లో టీడీపీ సీనియర్ నాయకుడు మురళి శ్రీనివాసరావు శుక్రవారం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఉమ్మడి ప్రకాశం జిల్లా టిడిపి అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి మురళి శ్రీనివాసరావు పార్థివ దేహాన్ని దర్శించి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మురళి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను పరామర్శించి, పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. టిడిపికి మురళి శ్రీనివాసరావు చేసిన సేవలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు.