ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం జెసి అగ్రహారం సర్పంచ్ రమణయ్య వైసీపీని వీడి టిడిపిలో చేరారు. బుధవారం గిద్దలూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సమక్షంలో రమణయ్య టిడిపి కండువా తప్పుకున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మృతి కార్యక్రమాలు ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితుడినై టిడిపిలో చేరినట్లు సర్పంచ్ రమణయ్య తెలిపారు. ఆయనతోపాటు ఆయన వర్గీయులు కూడా టిడిపిలో చేరుతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో బేస్తవారిపేట టిడిపి నాయకులు పాల్గొన్నారు.