రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన ఇద్దరు సీనియర్ YSRCP నేతలకు రాష్ట్ర స్థాయి పదవులు దక్కాయి. బొమ్మనహల్ మండలం దేవగిరి గ్రామానికి చెందిన రాజ్ కుమార్, డి.హిరేహాల్ మండలం సోమలాపురం గ్రామానికి చెందిన సుదర్శన్ రెడ్డి లను రాష్ట్ర సంయుక్త కార్యదర్శుగా నియమిస్తూ పార్టీ అధిష్టానం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. తమపై నమ్మకం ఉంచి ఈ బాద్యతలు అప్పగించిన జగన్మోహన్ రెడ్డి, మెట్టుగోవిందరెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.