ఉరవకొండ: బెలుగుప్పలో జిల్లా పంచాయతీ అధికారి ఆకస్మిక పర్యటన
అనంతపురం జిల్లా బెళుగుప్ప గ్రామ పంచాయతీ లో జిల్లా పంచాయితీ అధికారి టి.నాగరాజు నాయుడు శుక్రవారం ఆకస్మిక పర్యటన చేసారు. ప్రతి ఇంటికి వెళ్లి చెత్త కలెక్షన్ జరుగుతుందా లేదా అని ఆరా తీశారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింత సక్రమంగా చేపట్టాలని అప్పుడే ప్రజల నుండి మరింత స్పందన వస్తుందన్నారు. అలాగే SWPC సెంటర్ ను తనిఖీ చేసి గ్రామంలో ఇటీవల జరిగిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్షి నారాయణ, EORD హనుమంత రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మంజునాథ్, సాహస్ NGO కో ఆర్డినేటర్ ఆంజనేయులు మరియు స్వచ్ఛ భారత్ సిబ్బంది పాల్గొన్నారు.