కనిగిరి: పట్టణంలో పదో తరగతి, ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు శ్రీ సాయి ప్రతిభా పురస్కారాల పంపిణీ
కనిగిరి పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో పదో తరగతి మరియు ఇంటర్ లో ప్రతిభ కనబరిచి అత్యధిక మార్పులు సాధించిన విద్యార్థులకు శ్రీ సాయి ప్రతిభ పురస్కారాలను ఎంఈఓ పెద్దిరాజు, దేవస్థాన కమిటీ చైర్మన్ సత్యాలు, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తండ్రి నర్సారెడ్డి గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కనిగిరి, వెలిగండ్ల, హనుమంతునిపాడు మండలాల్లో ఇంటర్ మరియు 10వ తరగతిలో అత్యధిక మార్పులు సాధించిన విద్యార్థులు శ్రీ సాయి ప్రతిభా పురస్కారాలను అందుకున్నారు. పురస్కారాలను అందుకున్న విద్యార్థులను ఎంఈఓ పెద్దిరాజు అభినందించారు.