కనిగిరి: పట్టణంలో ఈ నెల 6న కాంస్య విగ్రహ ఆవిష్కరణ, ఏర్పాట్లను చక చకా పూర్తి చేస్తున్న అధికారులు
కనిగిరి పట్టణంలో ఈ నెల 6 వ తేదీ శనివారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. కార్యక్రమానికి కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్, రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు , అధికారులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లను చక చకా పూర్తి చేస్తున్నారు. వేదిక నిర్మాణ పనులను చేపట్టారు. కార్యక్రమానికి తరలివచ్చే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.