కనిగిరి: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికుల ధర్నా
కనిగిరి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు మంగళవారం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి హాజరైన సిఐటియు జిల్లా కార్యదర్శి కేశవరావు మాట్లాడుతూ... మున్సిపల్ కార్మికులకు పెండింగ్ వేతనాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కనిగిరి మున్సిపాలిటీలో పెరిగిన వార్డులకు అనుగుణంగా మున్సిపల్ కార్మికులను కూడా పెంచాలన్నారు. వార్డులు పెరగడంతో మున్సిపల్ కార్మికులు పని భారం ఎక్కువై వెట్టి చాకిరీ చేయవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అధికారులు సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.