రాప్తాడు: ఏడుగుర్రాలపల్లి గ్రామంలో సమీపంలో పంట పొలాలు 40 సంవత్సరాల వయసు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి అనుమాన స్థితిలో మృతి
సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడు గుర్రాల పల్లి గ్రామ సమీపంలో సోమవారం మధ్యాహ్నం మూడున్నర సమయంలో అనుమాన స్థితిలో మృతి చెందిన ఒక మృతి దేహాన్ని స్థానిక గ్రామస్తులు గుర్తించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తెలిపిన సమాచారం ఏడు గుర్రాల పల్లి గ్రామ సమీపంలో మూడున్నర గంటల సమయంలో ఒక మృతి దేహాన్ని గమనించి రామగిరి పోలీసులకు సమాచారం తెలపడం జరిగింది అని పోలీసులు మృతి దేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ఆస్పత్రికి తరలించడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు, అయితే మృతి చెందిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ఎవరైనా హత్య చేశారని పూర్తి సమాచారం పోలీసులు దర్యాప్తులో తెలియాల్సి ఉంది.