కనిగిరి: శ్రీ షిరిడి సాయిబాబా బోధనలు ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో శ్రీ సాయి తెలుగు సత్య హరిత పారాయణ 73వ వసంతోత్సవ కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాజీమంత్రి మహేందర్రెడ్డి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం ప్రతి ఒక్కరూ అనుసరించదగినది అన్నారు. మహిమాన్వితుడైన శ్రీ సాయిబాబా బోధనలు ప్రతి ఒక్కరికి అనుసరణీయం, ఆదర్శనీయమైనది అన్నారు. కార్యక్రమంలో శ్రీ సాయిబాబా దేవస్థాన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.