కొండపి: కొండపిలో సబ్సిడీపై నాణ్యమైన బియ్యాన్ని అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా కొండపిలో సోమవారం ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రజలకు సబ్సిడీపై అందిస్తున్న కేంద్రాలను స్థానిక సచివాలయంలో ప్రారంభించారు. బహిరంగ మార్కెట్లలో దొరికే బియ్యం ధరతో పోల్చుకుంటే ఈ బియ్యం పది రూపాయలకు పైగా ధర తక్కువగా లభిస్తుందని మంత్రి ప్రజలకు తెలిపారు. జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారితో కలిసి ఈ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేదలకు తక్కువ ధరకే బియ్యం అందించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రప్రభుత్వం చేపట్టిందని మంత్రి అన్నారు.