ఉరవకొండ: బెలుగుప్ప గ్రంథాలయాన్ని తనిఖీ చేసిన గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పోలగల్లు కమ్మన్న
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని గ్రంథాలయాన్ని శనివారం గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పోలగల్లు కమ్మన్న వార్షిక తనిఖీ నిర్వహించారు. గ్రంథాలయంలో కొనసాగుతున్న సమ్మర్ స్పెషల్ క్యాంప్ నందు ఉన్న పిల్లలకు సమ్మర్ క్యాంప్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అలాగే సెస్ బకాయిలను గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి ప్రతాపరెడ్డి తో కలిసి సూచించారు.