సంతనూతలపాడు: సెన్సెస్ పోర్టల్ ద్వారా తమ జనాభా వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం: సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్
సంతనూతలపాడు నియోజకవర్గంలోని ప్రజలు సెన్సెస్ పోర్టల్ ద్వారా తమ జనాభా వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని సంతనూతలపాడు శాసనసభ్యులు బి ఎన్ విజయ్ కుమార్ తెలిపారు. గురువారం సంతనూతలపాడు లోని తన నివాసంలో అధికారులతో కలిసి ఎమ్మెల్యే విజయ్ కుమార్ సెన్సెస్ పోర్టల్ ద్వారా స్వీయ గణన ప్రక్రియ పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సెన్సెస్ పోర్టల్ ద్వారా జనాభా వివరాలు నమోదు చేసుకునేటప్పుడు ఎటువంటి డాక్యుమెంట్లను సమర్పించే అవకాశం లేదన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, ఎమ్మార్వో బ్రహ్మయ్య పాల్గొన్నారు.