రాప్తాడు: శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయంలో నాగేంద్ర రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎస్కే యూనివర్సిటీ ఉపకులపతి జ్యోతి కుమార్
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయంలో సోమవారం నాలుగు గంటల 45 నిమిషాల సమయం లో ఉపకులపతి జ్యోతి కుమార్ ఎస్కే యూనివర్సిటీ అకాడమిక్ కన్సల్టెంట్ నాగేంద్ర రచించిన తెలుగు పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా జ్యోతి కుమార్ మాట్లాడుతూ ఎస్కి యూనివర్సిటీ అకాడమీ కన్సల్టెంట్ నాగేంద్ర రచించిన తెలుగు పుస్తకాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందని ఇలాంటి పుస్తకాలను ఎస్కే యూనివర్సిటీ అధ్యాపకులు విద్యార్థినీలు సద్వినియోగం, చేసుకోవాలని మాతృభాషను ఎవరు మరవకూడదని ఉపకులపతి జ్యోతి కుమార్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రొఫెసర్లు పాల్గొన్నారు.