కనిగిరి: వెంగపల్లి లో ఉరి వేసుకుని ఇంటర్ విద్యార్థి గీతాంజలి ఆత్మహత్య
హనుమంతునిపాడు: ఉరివేసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన హనుమంతునిపాడు మండలం వేంగపల్లి లో గురువారం రాత్రి చోటు చేసుకోగా ఈ ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వెంగపల్లి గ్రామానికి చెందిన మేళం గీతాంజలి ఇటీవల ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తి చేసుకుని ద్వితీయ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. గీతాంజలి తండ్రి వెంకటేశ్వర్లు, ఆయన భార్య వ్యక్తిగత పనులు నిమిత్తం కనిగిరికి వెళ్ళగా, ఇంట్లో ఎవరూ లేని సమయంలో గీతాంజలి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.