కనిగిరి: పట్టణంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా లక్ష్మీ నరసింహ స్వామి పల్లకి సేవ
కనిగిరి పట్టణంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వేదపండితుల ఆధ్వర్యంలో శనివారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి పల్లకి సేవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన భక్తులు ఆలయానికి తరలివచ్చి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి పల్లకి సేవ కార్యక్రమంలో పాల్గొని, స్వామివారి పల్లకీని స్వయంగా మోసి, కొబ్బరికాయలు కొట్టి, హారతులు పట్టి పూజలు చేశారు. భక్తులకు ఆశీర్వచనాలను అందజేసిన వేద పండితులు స్వామివారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.