కనిగిరి: ఈనెల 27, 28 తేదీల్లో టిడిపి నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి పట్టణంలోని టిడిపి కార్యాలయంలో కనిగిరి ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి టిడిపి క్లస్టర్ ఇన్చార్జీలు, మండల పార్టీల అధ్యక్షులతో శుక్రవారం సమావేశం అయ్యారు. ఈనెల 27, 28 తేదీల్లో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా వర్చువల్ గా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి సూచించారు. నియోజకవర్గంలోని 6 మండలాల్లో టిడిపి నాయకులు మరియు కార్యకర్తలు వర్చువల్ గా మహానాడు కార్యక్రమానికి హాజరు కావలసి ఉంటుందని ఎమ్మెల్యే సూచించారు. టిడిపి నాయకులు తమ విలువైన సూచనలు, సలహాలు ఈ సందర్భంగా అందజేయాలన్నారు.