సంతనూతలపాడు: మద్దిపాడు లో కుటుంబ కలహాల కారణంగా ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
మద్దిపాడులో కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తి, గత కొంతకాలంగా భార్యతో విభేదించి ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఆంజనేయులు తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.