ఉరవకొండ: పట్టణంలో జరిగిన వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమ నిరసన కార్యక్రమానికి కదం తొక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులు
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు ప్రస్తుత ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిన సంద ర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, హామీలను ఎగ్గొట్టిన కూటమి ప్రభుత్వం పై వెన్నుపోటుకు రెండేళ్లు అనే కార్యక్రమం లో భాగంగా పట్టణంలో శుక్రవారం భారీ నిరసన ప్రదర్శన జరిగింది. వైయస్సార్సీపీ పీ ఏ సీ సభ్యులు విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలోఈ ప్రదర్శనకు ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టీ అభిమానులు తరలివచ్చి దిగ్విజయం చేశారు.