రాప్తాడు: చెన్నై కొత్తపల్లిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు పట్టా పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పరిటాల సునీత
సత్య సాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలో సోమవారం 11:30 నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రాజముద్రతో కూడిన పట్టా పాస్ పుస్తకాలను రైతులకు ఎమ్మెల్యే పరిటాల సునీత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సీఎం జగన్ ఫోటోను ముద్రించి రైతులకు పాసు పుస్తకాలను ఇవ్వడం జరిగిందని వాటిని రద్దుచేసి రాజముద్రతో ముద్రించిన పట్టా పాస్ పుస్తకాలను రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు రైతులు టిడిపి నేతలు పాల్గొన్నారు.