కళ్యాణదుర్గం: మా కోడికి పాఠశాల అభివృద్ధి కోసం దంపతులు రాజన్న, సునీలా రూ.41,116 విరాళం
సెట్టూరు మండలం మా కోడికి పాఠశాల అభివృద్ధి కోసం అదే గ్రామానికి చెందిన దంపతులు రాజన్న, సునీలా దంపతులు గురువారం భారీగా విరాళం అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులుకు దంపతులు రూ.41,116 విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దంపతులు మాట్లాడుతూ ఎమ్మెల్యే సురేంద్రబాబు పిలుపుమేరకు పాఠశాల అభివృద్ధి కోసం విరాళం అందజేశామన్నారు.