రాప్తాడు: చిన్మయి నగర్ జేఎన్టీయూలో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సైన్స్ కమ్యూనికేషన్ సదస్సులో పాల్గొన్న ఉపకులపతి హెచ్ సుదర్శన్ రావు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్మయి నగర్ జెఎన్టియు విశ్వవిద్యాలయంలో సోమవారం 11 గంటల నుంచి నాలుగు గంటల వరకు నిర్వహించిన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సైన్స్ కమ్యూనికేషన్ మరియు రచన అనే అంశంపై ఒక్కరోజు నిర్వహించిన వర్క్ షాప్ లో జేఎన్టీయూ ఉపకులపతి హెచ్ సుదర్శన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపకులపతి సుదర్శన్ రావు మాట్లాడుతూ జేఎన్టీయూ విశ్వవిద్యాలయం చెందిన 30 మంది విద్యార్థులు కేంద్రీయ విశ్వవిద్యాలయం చెందిన పదిమంది విద్యార్థులు ఈ వర్క్ షాప్ లో పాల్గొని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సైన్స్ కమ్యూనికేషన్ పైన సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని జేఎన్టీయూ ఉపకులపతి సుదర్శన్ రావు పేర్కొన్నారు.