కనిగిరి: పట్టణంలో రూ.16.40 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న డ్రైనేజీ కాలువలకు శంకుస్థాపన చేసిన మున్సిపల్ కమిషనర్ శ్రీధర్
కనిగిరి పట్టణంలోని 5వ వార్డులో రూ.16.40 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులకు కనిగిరి మున్సిపల్ కమిషనర్ పి శ్రీధర్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో కమిషనర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కనిగిరి పట్టణ ప్రజలకు సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, తాగునీటి వంటి వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మున్సిపాలిటీని కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సహకారంతో అన్ని విధాల అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. కనిగిరి పట్టణ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కమిషనర్ కోరారు.