కనిగిరి: జలధార-జల హారతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది: మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత
కనిగిరి: జల ధార- జల హారతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత అన్నారు. కనిగిరిలో జల ధార- జల హారతి కార్యక్రమం 100 రోజుల ప్రణాళికలో భాగంగా నియోజకవర్గస్థాయిలో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో శుక్రవారం కలెక్టర్ విజయ సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... వెనుకబడిన మార్కాపురం జిల్లా ప్రత్యేకించి కనిగిరి నియోజకవర్గలో ఈ కార్యక్రమం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించడంతోపాటు నీటి సంరక్షణ చర్యలను చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు.