రాప్తాడు: మనీలా గ్రామంలో బిఎస్సి కంపెనీ పై చర్యలు తీసుకోండి అనంతపురం ఆర్డిఓ కార్యాలయం వద్ద గ్రామస్తులు సిపిఎం పార్టీ నేతలు నిరసన
అనంతపురం జిల్లా కేంద్రంలో బుధవారం 11:30 గంటల సమయంలో మనీలా గ్రామానికి చెందిన రైతులు సిపిఎం పార్టీ ప్రాంతీయ కార్యదర్శి రామాంజనేయులు బిఎస్సి కంపెనీ పై చర్యలు తీసుకోవాలని నిరసన కార్యక్రమాన్ని ఆర్డీవో కార్యాలయం వద్ద చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నల్లప్ప మాట్లాడుతూ మనీలా గ్రామంలో బిఎస్సి ప్రైవేట్ లిమిటెడ్ కంకర క్రషింగ్ కంపెనీ రైతులు భూములు ఆక్రమించుకుంటూ చెడ్డమును కూడా ఆక్రమించుకుంటున్నారని ఇలాంటి బీఎస్సీ కంపెనీ పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నల్లప్ప డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు.