సంతనూతలపాడు: నాగులుప్పలపాడు మండలంలో విద్యుత్ లో వోల్టేజి సమస్యల పరిష్కారానికి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటుచేసిన అధికారులు
నాగులుప్పలపాడు మండలంలో విద్యుత్ లో ఓల్టేజి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఈఈ సత్యనారాయణ తెలిపారు. ఆదివారం నాగులప్పలపాడు లో విద్యుత్ లో ఓల్టేజీల సమస్యల పరిష్కారానికి ఏర్పాటుచేసిన అదనపు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను విద్యుత్ శాఖ సిబ్బందితో కలిసి ఆయన పరిశీలించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో విద్యుత్ లో వోల్టేజి సమస్యలను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అవసరమైన చోట్ల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.