సంతనూతలపాడు: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు: మందుబాబులకు సంతనూతలపాడు ఎస్సై అజయ్ బాబు హెచ్చరిక
సంతనూతలపాడు: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై అజయ్ బాబు హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిని గుర్తించేందుకు శుక్రవారం ఎస్ఐ అజయ్ బాబు సిబ్బందితో కలిసి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిని గుర్తించి , వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. సంతనూతలపాడు మండలంలో ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో, ఆలయాలు, పాఠశాలలకు సమీపంలో బహిరంగంగా మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం వారి చేత ఖాళీ మద్యం బాటిల్లను ఏరి వేయించి, ఆ ప్రదేశాలను శుభ్రం చేయించారు.