కదరిదేవరపల్లి-తిరుపతి ప్యాసింజర్ రైలు ఇంజన్ సాంకేతిక లోపంతో కదరిదేవరపల్లి సమీపంలో ఆగిపోయింది. మధ్యాహ్నం 2:35 గంటలకు కళ్యాణదుర్గం చేరుకోవాల్సిన ఈ రైలు, సాయంత్రం 5 గంటలైనా రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గుంతకల్లు నుంచి మరో ఇంజిన్ తెప్పించి రైలును పంపనున్నట్లు అధికారులు తెలిపారు. దీనివల్ల ప్రయాణం మరో గంటన్నర ఆలస్యం అయ్యే అవకాశం ఉందని రైల్వే వర్గాలు వెల్లడించాయి.