కనిగిరి: పట్టణంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మలేరియా వ్యాధిపై వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ
కనిగిరి పట్టణంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల వద్ద నుండి ప్రధాన వీధుల్లో ఈ అవగాహన ర్యాలీ కార్యక్రమం కొనసాగింది. కార్యక్రమానికి హాజరైన కనిగిరి మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ మాట్లాడుతూ... మలేరియా వ్యాధి ప్రాణాంతకమైన వ్యాధి అన్నారు. దోమలు కుట్టకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇళ్లలో ఎక్కువ రోజులు నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలని, నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెంది మలేరియా వ్యాధికి కారణం అవుతాయని కమిషనర్ అన్నారు.