ఉరవకొండ: సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రామ రెవిన్యూ అధికారులు దృష్టి సారించాలి : బెలుగుప్ప మండల తహసిల్దార్ అనిల్ కుమార్
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని గ్రామాల్లో సమస్యలపై వచ్చే అర్జీలపై గ్రామ రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడే సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని మండల తహసిల్దార్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో గ్రామ రెవెన్యూ కార్యదర్శులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రధానంగా PGRS, SIR, Re-Survey, Natural calamities, Rastha issues, dotted Lands, sec-22 A, Civil supplies అంశాలపై చర్చించి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని సూచించారు.