రాయదుర్గం: ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ధర్నా
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. రాయదుర్గం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం వరకు చేరుకుని ధర్నా నిర్వహించారు. ఆ పార్టీ డివిజన్ కార్యదర్శి నాగార్జున మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం వచ్చాక మణిపూర్ హింసాత్మక ఘటనలు, నీట్ పేపర్ లీక్, పెట్రోల్ డీజిల్ పెంపు లాంటి ప్రజా వ్యతిరేక చర్యలు చేపట్టిందని ధ్వజమెత్తారు. ఈనెల 17 న కలెక్టరేట్ వద్ద ధర్నా, సెప్టెంబర్ 1 న చలో ఢిల్లీ చేపడుతున్నట్లు తెలిపారు.