కనిగిరి: తాడేపల్లిలో మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ని కలిసిన కనిగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి నారాయణ యాదవ్
కనిగిరి: మాజీ సీఎం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కనిగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కనిగిరి నియోజకవర్గం లో వైసీపీ తరఫున చేపడుతున్న కార్యక్రమాలను వైయస్ జగన్మోహన్ రెడ్డికి నారాయణ యాదవ్ వివరించారు. నియోజకవర్గంలో వైసిపిని బలోపేతం చేయాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి విజయం సాధించేలా కృషి చేయాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సూచించినట్లు నారాయణ యాదవ్ తెలిపారు.