కనిగిరి: కనిగిరి పట్టణంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 48.03 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, జనసంచారం లేక నిర్మానుష్యంగా రహదారులు
కనిగిరి పట్టణంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం రాష్ట్రంలోనే అత్యధికంగా కనిగిరిలో 48.03 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. ఉదయం 9 గంటల నుండి ప్రచండ బానుడి భగభగలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ వేడిమి తీవ్రం కావడం, దీనికి తోడు పొడగాలులు వేయడంతో స్థానిక ప్రజలు ఇళ్ల నుండి బయటకు వచ్చేందుకు భయపడిపోయారు. జనసంచారం లేక పట్టణంలోని రహదారులు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. మరో నాలుగు రోజులు తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.