ఉరవకొండ: ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి : ఏఐఎస్ఎఫ్
ఉరవకొండ నియోజకవర్గం వ్యాప్తంగా ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఉరవకొండ మండల విద్యాధికారి ఈశ్వరప్ప కు సోమవారం వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి తగ్గుపర్తి చందు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం జూన్ మాసంలో 2026- 27 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయిస్తే వాటిని తుంగలో తొక్కుతూ కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యులు మండలం లో ఇప్పటినుంచి ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని తెలిపారు.