ఉరవకొండ: బ్రాహ్మణపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక మండల పూజలు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక మండల పూజా కార్యక్రమాలను వేద పండితులు నిర్వహించారు. ఇటీవల ఆలయానికి దాతలు విరాళంతో గోపురం నిర్మాణం చేపట్టి కలశ ప్రతిష్ట పూజ కార్యక్రమం నిర్వహించి మండలం రోజులు పూర్తి కావడంతో ఆలయంలో ప్రత్యేక మండలం పూజా కార్యక్రమాలను పూజలను చేశారు. స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించి తీర్థ ప్రసాదాల పంపిణీని ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు.