కనిగిరి: పామూరు వద్ద జాతీయ రహదారిపై ఆటో బోల్తా పడి పలువురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు
పామూరు జాతీయ రహదారిపై ఆటో బోల్తా పడి పలువురికి గాయాలైన సంఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పామూరు మండలం వీరరామపురం వద్ద నుండి బయలుదేరిన ఆటో తిరగల దిన్నెకు వెళుతుండగా జాతీయ రహదారిపై అదుపుతప్పి మోటార్ సైకిల్ ను ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలోని పలువురికి గాయాలు కాగా స్థానికులు 108 అంబులెన్స్ లో స్థానిక వైద్యశాలకు తరలించారు.