కనిగిరి: పట్టణంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశమైన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రియాజ్
కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్ నందు పంచాయతీ కార్యదర్శులతో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో అక్రమంగా వేసిన వెంచర్లపై ఉదాసీనంగా ఉండవద్దని, అక్రమ లేవట్లపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ భూములను కాపాడవలసిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులపై కూడా ఉందన్నారు. అదేవిధంగా గ్రామాల్లో పలు అభివృద్ధి పనులపై పంచాయతీ కార్యదర్శులతో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి సమీక్షించారు.