ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని చైతన్య కోచింగ్ సెంటర్లో తౌశిక్ అనే విద్యార్థి అనుమానాస్పద మృతి కేసు విచారణ వేగవంతమైంది. బాధితుడి తల్లిదండ్రుల ఆందోళనల నేపథ్యంలో, కేసును కందుకూరు సీఐ అన్వర్ బాషాకు అప్పగిస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం విచారణ చేపట్టిన సీఐ, అన్ని కోణాల్లో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి త్వరలోనే నిజాలను వెలుగులోకి తెస్తామని చెప్పారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు.