ఉరవకొండ: విడపనకల్లులో డెంగ్యూ నివారణ పై అవగాహన ర్యాలీ
జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా మలేరియా అధికారి డి ఓబులు గారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా విడపనకల్లు పీహెచ్సీ వైద్యాధికారి ఎం పుష్ప ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీతో అవగాహన సమావేశం నిర్వహించడం జరిగింది . 2026 సంవత్సరమునకు సంబంధించి సమాజ భాగస్వామ్యంతో డెంగ్యూ నివారణ అనే నినాదంతో జాతీయ డెంగ్యూ దినోత్సవం నిర్వహించడం జరిగినదని ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరాంరెడ్డి పేర్కొన్నారు డెంగ్యూ వ్యాధి డెంగ్యూ వైరస్ ద్వారా ఈ డి స్ దోమ కాటు వల్ల వ్యాపిస్తుందని అధిక జ్వరం, కండరాల నొప్పులు డెంగ్యూ లక్షణాలన్నారు.