కనిగిరి: టిడిపిలో కష్టపడి పని చేసే నాయకులకు గుర్తింపు: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి: టిడిపిలో కష్టపడి పని చేసే నాయకులకు పార్టీ తగిన గుర్తింపు ,గౌరవం ఇస్తుందని కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో టిడిపి యూనిట్ మరియు క్లస్టర్ ఇన్చార్జిలకు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... టిడిపి యూనిట్, క్లస్టర్ ఇన్చార్జులు బూత్ కమిటీల కన్వీనర్లను సమన్వయం చేసుకొని ఓటర్ల సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించాలన్నారు. ఓటర్లను టిడిపికి చేరువచేసేలా కార్యాచరణ రూపొందించాలన్నారు.