రాప్తాడు: రామగిరి మండల కేంద్రంలో ప్రజా దర్బారు టిడిపి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
సత్యసాయి జిల్లా రామగిరి మండల కేంద్రంలో శనివారం 11:30 గంటల సమయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత టిడిపి కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ రామగిరి మండల కేంద్రంలో టిడిపి కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించి పార్టీ కార్యక్రమాల గురించి చర్చించడం జరిగిందని అదేవిధంగా కార్యకర్తల యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగింది అన్నారు అనంతరం ప్రజా దర్బారు నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను తీసుకొని వాటి పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించడం జరిగిందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులంతా పాల్గొన్నారు.