సంతనూతలపాడు: చీమకుర్తి లో విద్యుత్ తీగల కు తగలడంతో తగలబడిన ట్రక్కు, వెంటనే స్పందించి మంటలను అదుపు చేసిన స్థానికులు
చీమకుర్తి మైనింగ్ డంపింగ్లో తిరిగే ఓ భారీ ట్రాక్ మంగళవారం అగ్నికి ఆహుతైంది. ట్రక్కు వస్తున్న సమయంలో పై నున్న కరెంటు తీగను ట్రక్కుకు తగలడంతో మంటలు చెలరేగాయని స్థానికులు చెప్పారు. స్పందించి స్థానికులు వెంటనే మంటలను అదుపు చేసే చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు.