రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద TWJF జర్నలిస్టు సంఘం నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండేళ్లు దాటిన ఇప్పటిదాకా జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వకుండా స్టిక్కర్లతో కాలక్షేపం చేస్తున్నారని, IAS అధికారులు, DPRO తదితరులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ నారాయణ రెడ్డికి అందించారు.